1)మూడు సార్లు నదిలో నుంచీ మట్టిని తీసి ఒడ్డు మీద వేసి అప్పుడు స్నానం చేయాలి. నదులు చెరువులలో స్నానం చేసే ముందు ఈ విధంగా చేయడం వలన ప్రత్యేకంగా పూడిక తీత పనులు చేయాల్సిన అవసరం రాదు. ఇది ప్రాచీన రుషులు చెప్పిన స్నానవిధి.
2)నదీ స్నానం చేసేటప్పుడు ఆధునిక శుద్ధిపదార్థాలైన షాంపూ, సబ్బు వంటివి వాడరాదు. మృత్తికా స్నానం చేయవచ్చు. నూనె రాసుకోవడం, నలుగు పెట్టుకోవడం కూడా పుష్కర సమయంలో నిషేధమే.
3) పరిశుభ్రమైన మట్టి దొరికినప్పుడు దానిని ఒంటికి రాసుకుని చేయడం తప్పుకాదు. నేడు కోట్లాది మంది స్నానం చేస్తున్న పుష్కర ఘాట్ లలో ఈ రకమైన మట్టి దొరికే అవకాశం లేదు. కనుక భక్తితో మంత్ర సహిత స్నానం చేయడమే ఉత్తమం. ఆపోహిష్టామయో… అనే మంత్రం, సర్వనదీనామాలున్న శ్లోకాలు పఠిస్తూ స్నానం చేయాలి. పలుమార్లు మునకలు వేయాలి.
4) రాత్రి ధరించిన వస్త్రాలతో స్నానం చేయకూడదు.
5) ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి స్నానం చేయాలి.
6) స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ … పిండటంగాని చేయకూడదు. బట్టల సబ్బు అసలు వాడరాదు.
7) అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు.
8) పళ్లు తోముకోవడం, కాలకృత్యములు తీర్చు కోవడం వంటివి నదీ ప్రాంతాలలో చేయరాదు. నదులలో గుప్తప్రదేశాలు శుభ్రం చేసుకోరాదు.
9)ఆధునిక స్విమ్మింగ్ పూల్స్ లో ఏ విధమైన నియమ నిబంధనలున్నాయో అవే నిబంధనలు నదీస్నానాలలో మనవారు ఎప్పుడో విధించారని గుర్తుంచుకోండి.
శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు నెత్తికి చుట్టుకుంటాయి
2)నదీ స్నానం చేసేటప్పుడు ఆధునిక శుద్ధిపదార్థాలైన షాంపూ, సబ్బు వంటివి వాడరాదు. మృత్తికా స్నానం చేయవచ్చు. నూనె రాసుకోవడం, నలుగు పెట్టుకోవడం కూడా పుష్కర సమయంలో నిషేధమే.
3) పరిశుభ్రమైన మట్టి దొరికినప్పుడు దానిని ఒంటికి రాసుకుని చేయడం తప్పుకాదు. నేడు కోట్లాది మంది స్నానం చేస్తున్న పుష్కర ఘాట్ లలో ఈ రకమైన మట్టి దొరికే అవకాశం లేదు. కనుక భక్తితో మంత్ర సహిత స్నానం చేయడమే ఉత్తమం. ఆపోహిష్టామయో… అనే మంత్రం, సర్వనదీనామాలున్న శ్లోకాలు పఠిస్తూ స్నానం చేయాలి. పలుమార్లు మునకలు వేయాలి.
4) రాత్రి ధరించిన వస్త్రాలతో స్నానం చేయకూడదు.
5) ఉదయాన్నే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి స్నానం చేయాలి.
6) స్నానం చేసిన తరువాత వస్త్రాలను నదిలో ఉతకడంగానీ … పిండటంగాని చేయకూడదు. బట్టల సబ్బు అసలు వాడరాదు.
7) అలాగే స్నానం చేసే సమయంలో ఉమ్మి వేయడం వంటివి చేయకూడదు.
8) పళ్లు తోముకోవడం, కాలకృత్యములు తీర్చు కోవడం వంటివి నదీ ప్రాంతాలలో చేయరాదు. నదులలో గుప్తప్రదేశాలు శుభ్రం చేసుకోరాదు.
9)ఆధునిక స్విమ్మింగ్ పూల్స్ లో ఏ విధమైన నియమ నిబంధనలున్నాయో అవే నిబంధనలు నదీస్నానాలలో మనవారు ఎప్పుడో విధించారని గుర్తుంచుకోండి.
శాస్త్రం సూచించిన ఈ నియమాలను పాటిస్తూ పవిత్ర స్నానాలు చేసినప్పుడు మాత్రమే పుణ్య ఫలాలు లభిస్తాయి. లేదంటే కొత్త పాపాలు నెత్తికి చుట్టుకుంటాయి
No comments:
Post a Comment