మహారాష్ట్ర నాసిక్ లో పుట్టి సుమారు 1665 మైళ్ళకు పైబడి ప్రవహీంచి చివరకు తూర్పున బంగాళఖాతంలో సాగర సంగమమవుతుంది. ఈ నది గో కళేబరమును ఆవరించి ప్రవహించినది కావున "గోదావరి" అని పేరు వచ్చినది. బృహస్పతి ప్రతిరాశిలోను ప్రవేశించు ఒక్కో సంవత్సర సమయాన్నిఒక్కొక్క నదికి ఇలా పుష్కర సమయాన్ని బ్రహ్మ నిర్దేశిస్తాడు.
- తేది.14-7-2015 నుండి 25-7-2015 వఱకు.
- పుష్కర కాలము--- 12 రోజులు
- పుష్కరము అంటె -12 సంవత్సరములు
- ఈ పుష్కర సమయములో విధిగా దాన ధర్మములు మరియు పితృకార్యక్రమములు చేయవలయును.
- పుష్కర సమయములో చేయవలసిన దానములు:
- తేది - దైవం పేరు - దానములు/పూజలు
- జులై 14 - నారాయణ - ధాన్యము, రజితము, సువర్ణము
- జులై 15 - భాస్కర - వస్త్రము, లవణము, గోవు, రత్నము.
- జులై 16 - మహాలక్ష్మి - బెల్లము, కూరలు, వాహనము
- జులై 17 - గణపతి - నేయి, నువ్వులు, తేనె, పాలు, వెన్న
- జులై 18 - శ్రీకృష్ణ - ధాన్యము, బండి,గేదె, ఎద్దు, నాగలి
- జులై 19 - సరస్వతి - కస్తూరి, గంధపుచెక్క, కర్పూరము.
- జులై 20- పార్వతి - గృహము, ఆసనము, శయ్య.
- జులై 21- పరమేశ్వరుడు- కందమూలములు, అల్లము, పుష్పమూలము
- జులై 22- అనంత - కన్య,పఱుపు,చాప
- జులై 23- నరసింహ దుర్గ, లక్ష్మి, దేవి పూజ, సాలగ్రామం
- జులై 24 - వామన కంబళి, సరస్వతి , యజ్నోపవీతము, వస్త్రము, తాంబూలము
- జులై 25- శ్రీరామ - దశ,షోడశ మహాదానములు
No comments:
Post a Comment